స్మార్ట్‌ సిటీ ఛైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-10-21T07:07:09+05:30 IST

తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ రాష్ట్ర అధికారప్రతినిధి నారమల్లి పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

స్మార్ట్‌ సిటీ ఛైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

తిరుపతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ రాష్ట్ర అధికారప్రతినిధి నారమల్లి పద్మజ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయరు శిరీష, కమిషనరు గిరీష, డిప్యూటీ మేయర్లు అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, ఇతర వైసీపీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వంద స్మార్ట్‌ సిటీల్లో తిరుపతి మొదటి స్థానంలో నిలిపేలా కృషిచేస్తామని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-10-21T07:07:09+05:30 IST