నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టి డంపింగ్‌

ABN , First Publish Date - 2021-04-18T07:05:11+05:30 IST

నిద్రిస్తున్న వ్యక్తిపై నిర్లక్ష్యంగా టిప్పర్‌తో మట్టిని డంప్‌ చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో

నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టి డంపింగ్‌

 అక్కడికక్కడే మృతి

 కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ యాజమాన్యంపై కేసు

 

మాదాపూర్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): నిద్రిస్తున్న వ్యక్తిపై నిర్లక్ష్యంగా టిప్పర్‌తో మట్టిని డంప్‌ చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన రామ్‌నరేష్‌(32) ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తూ కంపెనీకి చెందిన ఓ షెడ్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న రాత్రి 10.30గంటల సమయంలో షెడ్‌ సమీపంలోని ఓ చెట్టుకింద రామ్‌నరేష్‌ నిద్రిస్తుండగా, ఇంకో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన వారు చూసుకోకుండా టిప్పర్‌లోని మట్టిని పడుకున్న రామ్‌నరే్‌షపై డంప్‌ చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతనిపై డంప్‌ చేసిన మట్టిని తొలగించి చూడగా. అప్పటికే మృతి చెందాడు. వాసవీ కన్‌స్ట్రక్షన్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. 


Updated Date - 2021-04-18T07:05:11+05:30 IST