పెళ్లి వేడుకలో విషాదం

ABN , First Publish Date - 2020-12-04T04:47:02+05:30 IST

లారీ కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లె మండల పరిధిలోని చిత్తూరు-కర్నూలు హైవేపై జరిగింది.

పెళ్లి వేడుకలో విషాదం
ప్రభా్‌స(ఫైల్‌ఫొటో)

లారీ కిందపడి ఆరేళ్ల బాలుడి మృతి


కేవీపల్లె, డిసెంబరు 3:  లారీ కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లె మండల పరిధిలోని చిత్తూరు-కర్నూలు హైవేపై జరిగింది. ఎస్‌ఐ రామ్మోహన్‌ వివరాల మేరకు.. కడపజిల్లా రామాపురం మండలం పోతుకూరిపల్లెకు చెందిన చలపతి, అరుణల కుమారుడు ప్రభా్‌స(6)తో కలసి కేవీపల్లె మండలం పాతవడ్డిపల్లెలో బంధువుల పెళ్లికి వచ్చారు. తిమ్మాపురం క్రాస్‌లోని వెంకటేశ్వరాలయంలో వివాహ వేడుకలు జరుగుతుండగా అక్కడికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బాలుడు రోడ్డు దాటుతుండగా పీలేరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు లారీ చక్రాల కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  ప్రమాదం అనంతరం డ్రైవర్‌ ఆగకుండా వెళ్లాడు. కేవీపల్లె ఎస్‌ఐ రామ్మోహన్‌  కలకడ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాలుడి మృతితో పెళ్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2020-12-04T04:47:02+05:30 IST