రెప్పపాటులో!
ABN , First Publish Date - 2021-01-14T05:34:08+05:30 IST
చిట్టివలస వేణు కుటుంబంతో విశాఖలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు ధనుష్, కుమార్తె లిఖిత ఉన్నారు. బుధవారం భోగిని విశాఖలో జరుపుకున్న వారు సంక్రాంతిని స్వగ్రామం కొండరాగోలులో జరుపుకోవాలని నిర్ణయించారు. కుమారుడు ధనుష్ను సమీప బంధువులతో బస్సులో పంపించారు. తరువాత కుమార్తె లిఖితను తీసుకొని బైక్పై బయలుదేరారు. భోగాపురం మండలం నారుపేట సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తు న్న లారీ అకస్మాత్తుగా ఆగింది. దీనిని గమనించలేకపోవడంతో వేణు లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య ఆదిలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. కుమారైకు స్వల్పగాయాల య్యాయి. ప్రమాదం జరిగిన తరువాత అచేతనంగా పడివున్న తల్లి వద్ద చిన్నారి రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది. విషయం తెలు సుకొన్న ఎస్ఐ యు.మహేష్ సంఘటనా స్థలానికి చేరుకొని తల్లీ కుమార్తెలను చికిత్స కోసం
రెప్పపాటులో!
లారీని ఢీకొన్న బైక్
భర్త దుర్మరణం
భార్య పరిస్థితి విషమం
స్వల్పగాయాలతో బయటపడిన కుమార్తె
బాధితులది కొండరాగోలు
భోగాపురం, జనవరి 13: సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకోవడానికి కుమార్తెతో కలిసి బైక్పై బయలుదేరారు. ఇంతలోనే ప్రమాదం ఎదురైంది. ఆగి వున్న లారీని వారి బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య గాయాలతో అపస్మారక స్థితికి చేరుకుంది. స్వల్పగాయాలతో బయటపడిన ఆ చిన్నారి తల్లి వద్ద కూర్చొని రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. భోగాపురం మండలం నారుపేట సమీపంలో జాతీయరహదారిపై బుధవారం జరిగిన ఘటనలో హిరమండలం మండలం కొండరాగోలుకు చెందిన చిట్టివ లస వేణు(35) దుర్మరణం పాలవ్వగా..భార్య ఆదిలక్ష్మి తీవ్రగాయాల పాలైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కొండరాగోలుకు చెందిన చిట్టివలస వేణు కుటుంబంతో విశాఖలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు ధనుష్, కుమార్తె లిఖిత ఉన్నారు. బుధవారం భోగిని విశాఖలో జరుపుకున్న వారు సంక్రాంతిని స్వగ్రామం కొండరాగోలులో జరుపుకోవాలని నిర్ణయించారు. కుమారుడు ధనుష్ను సమీప బంధువులతో బస్సులో పంపించారు. తరువాత కుమార్తె లిఖితను తీసుకొని బైక్పై బయలుదేరారు. భోగాపురం మండలం నారుపేట సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తు న్న లారీ అకస్మాత్తుగా ఆగింది. దీనిని గమనించలేకపోవడంతో వేణు లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య ఆదిలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. కుమారైకు స్వల్పగాయాల య్యాయి. ప్రమాదం జరిగిన తరువాత అచేతనంగా పడివున్న తల్లి వద్ద చిన్నారి రోదించిన తీరు అక్కడున్నవారిని కలిచివేసింది. విషయం తెలు సుకొన్న ఎస్ఐ యు.మహేష్ సంఘటనా స్థలానికి చేరుకొని తల్లీ కుమార్తెలను చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.