దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..

ABN , First Publish Date - 2021-03-08T09:39:19+05:30 IST

దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో 20 మందికిపైగా గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం

దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..

ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..‘పశ్చిమ’లో ఘటన

ఇద్దరి మృతి.. 20 మందికి గాయాలు..  


 ఏలూరు క్రైం/జంగారెడ్డిగూడెం, మార్చి 7: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో 20 మందికిపైగా గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామ పంచాయతీ కండ్రిక గ్రామానికి చెందిన సుమారు 70 మంది 3 ట్రాక్టర్లలో శనివారం అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా  బుట్టాయిగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ గుడికి బయలుదేరారు. తెల్లవారుజామున 3.15 గంటలకు జంగారెడ్డిగూడెం దాటిన తరువాత శ్రీనివాసపురం జంక్షన్‌ వద్ద బైపాస్‌ రోడ్డు (రాజమహేంద్రవరం - హైదరాబాద్‌)లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక ట్రాక్టర్‌ను ఆపి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుండగా..  అకస్మాత్తుగా వెనుక నుంచి మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ బోల్తాపడగా, అందులో ఉన్నవారు ఎగిరి రోడ్డుపై పడ్డారు.


స్థానికులు వచ్చి  క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి, అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో వే మారెడ్డి రాంబాబు (50) మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స హస్ర(2) అనే చిన్నారి మృతి చెందింది.  ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.   

Updated Date - 2021-03-08T09:39:19+05:30 IST