ఢీకొని వ్యక్తి ట్రాక్టర్మృతి
ABN , First Publish Date - 2021-06-20T05:38:53+05:30 IST
మండలంలోని వేములూరిపాడు గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది.
ఫిరంగిపురం, జూన్ 19 : మండలంలోని వేములూరిపాడు గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని వేములూరిపాడుకు చెందిన భీమనాఽథుని సాంబశివరావు (60) బైక్పై గుంటూరు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తు ట్రాక్టర్ బైక్ను ఢీకొనటంతో సాంబశివరావు రోడ్డుపై పడి మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాంబశివరావుకు భార్య శివమ్మ, కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె నాగమణి ఉన్నారు.