లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-17T04:40:51+05:30 IST

మోటారుసైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో గండికోట వెంకట సుబ్బయ్య(39) మృతిచెందిన ఘటన ఆదివారం కావలి పట్టణం ముసునూరు సమీపంలో

లారీ ఢీకొని యువకుడి మృతి

కావలి రూరల్‌, మే 16: మోటారుసైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో గండికోట వెంకట సుబ్బయ్య(39) మృతిచెందిన ఘటన ఆదివారం కావలి పట్టణం ముసునూరు సమీపంలో జాతీ య రహదారిపై చోటు చేసుకుంది. నెల్లూరు సమీపంలోని కొత్తూరుకు చెందిన వెంకట సుబ్బయ్య మోటారుసైకిల్‌పై ప్రకాశం జిల్లా కందుకూరు బయలుదేరాడు. మార్గమధ్యలో ముసునూరు సమీపంలో నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న లారీ మోటారుసైకిల్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెంకటసుబ్బయ్య తలకు తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  రూరల్‌ ట్రైనీ ఎస్‌ఐ ప్రవీణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-17T04:40:51+05:30 IST