మినీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-09T06:09:50+05:30 IST

బలభద్రపురం కెనాల్‌ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

మినీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

బిక్కవోలు, మార్చి 8: బలభద్రపురం కెనాల్‌ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ పి.వాసు వివరాల ప్రకారం... పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన అడపా సత్యనారాయణ(55) బలభద్రపురంలోని భారత్‌ పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం వస్తుండగా వెనుక నుంచి మినీ బస్సు ఢీకొట్టడంతో రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే 108లో రాయవరం ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-09T06:09:50+05:30 IST