గౌరవెల్లి రిజర్వాయర్‌ టన్నెల్‌లో ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-13T08:05:25+05:30 IST

గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 9 మం

గౌరవెల్లి రిజర్వాయర్‌ టన్నెల్‌లో ప్రమాదం

  • పేలిన పైపులైన్‌.. ఫోర్‌మన్‌ మృతి.. 9 మందికి గాయాలు

అక్కన్నపేట, ఆగస్టు 12: గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌ టన్నెల్‌లో నిర్మా ణ పనులు జరుగుతున్నాయి. బుధవారం టన్నెల్‌లోకి వచ్చిన నీటిని బయటకు పంపేందుకు మోటార్లతో పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఎయిర్‌ రావడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ పైప్‌లైన్‌ పేలింది. దీంతో అందులో నుంచి వచ్చిన నీటి తాకిడికి పైపులు, కంకర అక్కడ ఉన్న కార్మికులపై పడ్డాయి. వారంతా ఇనుప చువ్వలపై పడగా ఫోర్‌మన్‌ వంగ రమేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి స్వస్థలం వరంగల్‌ రూరల్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రం.

Updated Date - 2020-08-13T08:05:25+05:30 IST