singareni: పైకప్పు కూలి నలుగురు కార్మికుల మృతి

ABN , First Publish Date - 2021-11-10T21:42:32+05:30 IST

జిల్లాలో మరోసారి బొగ్గు గని ప్రమాదం

singareni: పైకప్పు కూలి నలుగురు కార్మికుల మృతి

మంచిర్యాల: జిల్లాలో మరోసారి బొగ్గు గని ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌లోగల ఎస్సార్పీ- 3 బొగ్గు గనిలో ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. గనిలో పనిచేస్తున్న కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, సూర్య నరసింహ రాజు, చంద్రశేఖర్ అనే కార్మికులపై గని పైకప్పు కూలింది. దీంతో వారు గనిలోనే మరణించారు. మృతదేహాలను వెలికితీయడానికి సింగరేణి రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. 




Updated Date - 2021-11-10T21:42:32+05:30 IST