ప్రయాణికులపైకి దూసుకెళ్లిన మినీ వ్యాన్
ABN , First Publish Date - 2021-12-12T15:44:21+05:30 IST
బస్టాప్లో వేచి ఉన్న వారిపై మినీ వ్యాన్ దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. రాణిపేట జిల్లా నెమిలి సమీపం జాగీర్తండలంకండిగైకు చెందిన లక్ష్మి (63), అర్చన (26) శ్రీపెరుంబుదూర్ సమీపంలోని ఓ
- ఇద్దరు మహిళల దుర్మరణం
వేలూరు(చెన్నై): బస్టాప్లో వేచి ఉన్న వారిపై మినీ వ్యాన్ దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. రాణిపేట జిల్లా నెమిలి సమీపం జాగీర్తండలంకండిగైకు చెందిన లక్ష్మి (63), అర్చన (26) శ్రీపెరుంబుదూర్ సమీపంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు పనికి వెళ్లేందుకు శనివారం ఉదయం బస్టాప్లో వేచి ఉన్న సమయంలో వేగంగా వచ్చిన మినీ వ్యాన్ వీరిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన అర్చన సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆస్పత్రిలో లక్ష్మి మృతిచెందింది. నెమిలి పోలీసులు కేసు నమోదుచేసి పరారీలో ఉన్న వ్యాన్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.