భవానీ భక్తులకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-17T04:26:55+05:30 IST

విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి తీపర్రు నుంచి మినీ వ్యాన్‌లో బయలు దేరి వెళ్లిన భవానీ భక్తులు జాతీయ రహదారిపై గన్నవరం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు.

భవానీ భక్తులకు గాయాలు

పెరవలి, అక్టోబరు 16: విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి తీపర్రు  నుంచి మినీ వ్యాన్‌లో బయలు దేరి వెళ్లిన భవానీ భక్తులు జాతీయ రహదారిపై గన్నవరం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. మార్గంమధ్యలో అదుపు తప్పి రోడ్డుపైనే పక్కకు ఒరిగిపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న  భవానీ భక్తులకు పది మందికి గాయాలు అయ్యాయి. స్థానిక పోలీసులు, స్థానికులు కలిసి వీరిని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం చేయించారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమ స్వగ్రామానికి చేరుకోవడంతోవారి కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి పెద్ద ప్రమాదం జరగనందుకు దుర్గమ్మదేవికి కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-10-17T04:26:55+05:30 IST