దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2022-01-24T04:38:45+05:30 IST
దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతిచెందాడు.
పాలకోడేరు, జనవరి 23 : దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతిచెందాడు. పాలకోడేరు శివారు ఏఎస్ఆర్ నగర్కు చెందిన ఎస్.అప్పారావు(55) ఆదివారం సాయంత్రం మోగల్లు పంచాయతీలోని గుత్తులవారిపాలెంలో పంటపొలాన్ని దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ వెనక్కి తిరగబడింది. దీంతో అప్పారావు ట్రాక్టర్ కింద మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.