రోడ్డు ప్రమాదంలో కార్పొరేటర్ కుమారుడు మృతి
ABN , First Publish Date - 2021-10-18T04:40:20+05:30 IST
రోడ్డు ప్రమాదంలో 1వ డివిజన్ కైకొండాయిగూడెం కార్పొరేటర్ కుమారుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్రోడ్లో ఆదివారం జరిగింది.
ఖమ్మంరూరల్, అక్టోబరు 17: రోడ్డు ప్రమాదంలో 1వ డివిజన్ కైకొండాయిగూడెం కార్పొరేటర్ కుమారుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్రోడ్లో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఒ కటో డివిజన్ కైకొండాయిగూడెం కార్పోరేటర్ తేజావత్ హేస్సేన్ కుమారుడు తేజావత్ వీరేందర్ (38), భార్య ధనలక్ష్మితో కలిసి కూసుమంచి మండలం కోక్యాతండాలో ఆదివారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై కైకొండాయిగూడెం వస్తుండగా వరంగల్ క్రాస్రోడ్కు వచ్చేసరికి వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో వీరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ధనలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.. స్ధానికులు వెంటనే ధనలక్ష్మిని చికిత్సనిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరేం దర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.