డివైడర్ ఢీకొని విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-01-18T06:24:31+05:30 IST
తండ్రి కొత్త బైక్ కొనుగోలు చేయగా దానిని నడుపుతూ అదుపుతప్పి ఓ విద్యార్థి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నెమలిపురి సెంటర్ సమీపంలో సోమవారం జరిగింది.
మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
ఒంగోలుకు చెందిన వారిగా గుర్తింపు
రాజుపాలెం, జనవరి 17: తండ్రి కొత్త బైక్ కొనుగోలు చేయగా దానిని నడుపుతూ అదుపుతప్పి ఓ విద్యార్థి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నెమలిపురి సెంటర్ సమీపంలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఒంగోలుకి చెందిన కుంచాల అంకమ్మరాజు కొత్తగా బైక్ కొనుగోలు చేశారు. ఈ బైక్ తీసుకుని ఇప్పుడే వస్తామని కుమారుడు రవికిరణ్(14), స్నేహితుడైన కే ప్రభాకర్తో కలిసి పిడుగురాళ్ల వైపు వస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై నెమలిపురి సెంటర్ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. దీంతో రవికిరణ్ అక్కడిక్కడే మృతి చెందగా ప్రభాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభాకర్ను చికిత్స నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.