డివైడర్‌ ఢీకొని విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-01-18T06:24:31+05:30 IST

తండ్రి కొత్త బైక్‌ కొనుగోలు చేయగా దానిని నడుపుతూ అదుపుతప్పి ఓ విద్యార్థి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నెమలిపురి సెంటర్‌ సమీపంలో సోమవారం జరిగింది.

డివైడర్‌ ఢీకొని విద్యార్థి మృతి
రవికిరణ్‌ మృతదేహం

మరో విద్యార్థికి తీవ్ర గాయాలు 

ఒంగోలుకు చెందిన వారిగా గుర్తింపు 

రాజుపాలెం, జనవరి 17: తండ్రి కొత్త బైక్‌ కొనుగోలు చేయగా దానిని నడుపుతూ  అదుపుతప్పి  ఓ విద్యార్థి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నెమలిపురి సెంటర్‌ సమీపంలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..  ఒంగోలుకి చెందిన కుంచాల అంకమ్మరాజు కొత్తగా బైక్‌ కొనుగోలు చేశారు. ఈ బైక్‌ తీసుకుని ఇప్పుడే వస్తామని కుమారుడు రవికిరణ్‌(14), స్నేహితుడైన కే ప్రభాకర్‌తో కలిసి పిడుగురాళ్ల వైపు వస్తున్నారు. ఈ క్రమంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై నెమలిపురి సెంటర్‌ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో రవికిరణ్‌ అక్కడిక్కడే మృతి చెందగా ప్రభాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభాకర్‌ను చికిత్స నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Updated Date - 2022-01-18T06:24:31+05:30 IST