ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి

ABN , First Publish Date - 2021-04-18T06:07:37+05:30 IST

మండ లంలోని మాక్లూర్‌ గ్రామానికి చెందిన మెతరి బాబాన్న(36) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృ తి చెందినట్టు గ్రామస్థులు తెలి పారు. మృతుడు శనివారం కా లకృత్యాలు తీసుకోవడానికి గ్రా మశివారులోని పంట కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ జారీ నీటిలో పడి ఈత రాక మృతి చెందినట్టు తెలిపారు.

ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి

మాక్లూర్‌, ఏప్రిల్‌17: మండ లంలోని మాక్లూర్‌ గ్రామానికి చెందిన మెతరి బాబాన్న(36) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృ తి చెందినట్టు గ్రామస్థులు తెలి పారు. మృతుడు శనివారం కా లకృత్యాలు తీసుకోవడానికి గ్రా మశివారులోని పంట కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ జారీ నీటిలో పడి ఈత రాక మృతి చెందినట్టు తెలిపారు. మృతు డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

గోదావరిలో పడి యువకుడు..

నందిపేట: ఉమ్మెడ శివారులో గోదావరి నదిలో పడి షేక్‌లాల్‌హైమద్‌ (29) అనే యువకుడు మృతి చెందినట్టు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. నిర్మల్‌ జిల్లా తనూర్‌ మండలం ఎన్‌వి గ్రామానికి చెందిన హైమద్‌ నిజా మాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలోని గోపిమెస్త్రీ దగ్గర పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఉగాది రోజు కుటుంబసభ్యులతో మాట్లాడిన హైమద్‌ అప్పటి నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రాగా కుటుంబసభ్యు లు వెతికసాగారు. గోదావరిలోని సౌడమ్మ కొండూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నీళ్ల లో గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం ఇవ్వగా పోలీసులు బయటకు తీయించారు. మృతుడి అన్న ఎస్‌ఎ.గపుర్‌ ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-04-18T06:07:37+05:30 IST