పంట ముంపుపై అచ్చెన్న ఆరా
ABN , First Publish Date - 2021-10-17T05:20:41+05:30 IST
మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో టెక్కలి మండల పరిధిలో ముంపు నకు గురైన ప్రాంతాలకు వివరాలను ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు పలువురు కార్యకర్తల నుంచి సమాచారం సేకరిం చారు.
టెక్కలి, అక్టోబరు 16: మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో టెక్కలి మండల పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాలకు వివరాలను ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావుతో పాటు పలువురు కార్యకర్తల నుంచి సమాచారం సేకరించారు. టెక్కలిలో జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు, కాలువ సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. టెక్కలిలో అధికంగా వర్షం కురవడంతో నాలుగురోడ్ల కూడలిలో వరదనీరుచేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై దృష్టి సారించాలన్నారు. అలాగే పలు రోడ్లు జలమయం అయ్యాయని తక్షణం స్పందించాలని కోరారు.
అచ్చెన్నను కలిసిన పి.గన్నవరం నేతలు
కోటబొమ్మాళి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడ లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురు టీడీపీ నేతలు కలిసి సమస్యలు వివరించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి జూలెం సుబ్బారావు, కాళ్ల సురేష్, జూలెం వెంక టేశ్వరావు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అచ్చెన్న వారికి సూచించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.