అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు చేశారు: అయ్యన్న

ABN , First Publish Date - 2020-09-20T02:17:30+05:30 IST

ఈఎస్‌ఐ స్కాంలో ఆధారాలు లేకపోయినా.. మాజీమంత్రి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు చేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు చేశారు: అయ్యన్న

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో ఆధారాలు లేకపోయినా.. మాజీమంత్రి అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు చేశారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈఎస్‌ఐ స్కాంతో మంత్రి జయరాంకు కూడా సంబంధం ఉందని, మంత్రి జయరాం కుమారుడికి బెంజ్‌ కారును ఇచ్చారని, ఒక ముద్దాయి ఇచ్చిన కారులో మంత్రి తిరగొచ్చా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేశాడు కాబట్టే మంత్రికి కారు గిఫ్ట్‌ ఇచ్చారని, దాన్ని గిఫ్ట్‌ కంటే లంచం అనడమే మంచిదని వ్యాఖ్యానించారు. కారు ఇతరులది అయితే ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు వేశారు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ వెళ్లినంత మాత్రాన టీడీపీకి నష్టం లేదని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

Updated Date - 2020-09-20T02:17:30+05:30 IST