AP: రాష్ట్రంలో రాక్షస పాలన: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-12-30T21:27:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

AP: రాష్ట్రంలో రాక్షస పాలన: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. గురువారం శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ఉండకూడదని జగన్‌రెడ్డి ప్రయత్నాలు చేశారని, జగన్‌రెడ్డి నాన్న, తాత ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఓటీఎస్ పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే వైసీపీ పరిమితమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2021-12-30T21:27:07+05:30 IST