పది నెలలైంది.. ఒక్క ఇటుకైనా పెట్టావా: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2020-04-09T04:28:05+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మెడ్ టెక్ జోన్పై ..
విశాఖ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మెడ్ టెక్ జోన్పై జగన్ చేసిన రాద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా టెస్టింగ్ కిట్లు మెడ్టెక్ జోన్లో తయారయ్యేసరికి తామే తెచ్చామనడానికి జగన్కు సిగ్గనిపించడంలేదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. మెడ్ టెక్ జోన్ను 2018లో చంద్రబాబు ప్రారంభించారని.. జగన్ సీఎం అయ్యాక దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఎండీని తొలగించారని ఆయన గుర్తు చేశారు.. ‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 10 నెలలు దాటింది. ఎక్కడైనా ఒక్క ఇటుక పెట్టావా?. ప్రతిపక్షనేతగా ముద్దులు కురిపించావు. పీఠమెక్కాక ప్రజాసంక్షేమ పథకాలు రద్దు చేశావు. రాష్ట్రానికి ఉపయోగపడేవి వద్దన్నావు. టీడీపీ కట్టినవాటికి రంగులు అద్దావు. పాలనంటే ఇదేనా?.’’ అని అచ్చెన్న ప్రశ్నించారు.