బాలకృష్ణ ఇంటిపై కాదు.. జగన్ ఇంటిపై దాడి చేయాలి: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-12-29T19:40:57+05:30 IST
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం అభివృద్ధిపై స్థానికులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఇంటిపై కాదు.. సీఎం జగన్మోహన్రెడ్డి ఇంటిపై దాడి చేయాలని హెచ్చరించారు. ఏపీలో భౌతిక దాడులు పెరిగాయన్న డీజీపీ క్రైమ్ రిపోర్టు చూసైనా తెలుసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధి ఇంటిపైనే దాడికి పాల్పడితే ప్రజల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. భయపెట్టి పాలన సాగిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.రాష్ట్రంలో అభివృద్ధి మరచిపోయి రెండున్నరేళ్లు గడిచిందని చెప్పారు.ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని అచ్చెన్నాయుడు అన్నారు.