‘సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-10-30T20:30:52+05:30 IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అభాండాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి..

‘సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలి’

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై అభాండాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి బహిరంగంగా విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ గానీ, ఆయన ప్రతినిధులు కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని, షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2020-10-30T20:30:52+05:30 IST