అట్రాసిటీ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-08-03T14:38:07+05:30 IST
కులం పేరుతో..
గుంటూరు: కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెడితే నాలుగు నెలలు అయినా గాని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చిలకలూరిపేట మండలం, మురికిపూడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జమ్మల మడక ఆదిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ దళిత, గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆదిబాబు మాట్లాడుతూ మైనింగ్ కోసం భూమిని ఇవ్వలేదని గ్రామానికి చెందిన ఆరుమళ్ల వెంకటశివ, ఆరుద్ర అనిల్ అనే వ్యక్తులు తనపై దాడి చేసి, కులం పేరుతో దూషించారని తెలిపారు. ఘటనపై పోలీసులను ఆశ్రయించి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టానని, కేసు పెట్టి నాలుగు నెలలు అవుతున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేద న్నారు.