చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-09-17T05:00:22+05:30 IST
అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబరు 16: అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదో వార్డులోని సత్యసాయి ఆలయం వద్ద ఏపుగా పెరిగిన చెట్లను అనవసరంగా కొంతమంది నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అటవీశాఖ, మున్సిపల్ అధికారులు బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.