వామన్రావు హత్య కేసులో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-05-08T05:05:14+05:30 IST
మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గ ట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో అసత్యాలను ఏవరైనా ప్రచారం చేస్తే చర్య లు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ హెచ్చరించారు.
- గోదావరిఖని ఏసీపీ ఉమేందర్..
మంథని, మే 7: మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గ ట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో అసత్యాలను ఏవరైనా ప్రచారం చేస్తే చర్య లు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ హెచ్చరించారు. స్థానిక పోలీస్స్టేషన్లోని సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ మండలంలోని పోతారం సర్పంచ్ భర్త సదానందం, మంథనికి చెం దిన మూల పురుషోత్తంరెడ్డిలు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య అనంత రం మాట్లాడుకున్న ఆడియో లీకేజీపై ఏసీపీ ఉమేందర్ మాట్లాడుతూ ఈ ఆడియోపై ఇద్దరు తప్పు ఒప్పుకున్నారన్నారు. కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అసత్య ప్రచారం జరగడం వల్ల అనేక అనుమానాలు తలెత్తుతాయన్నారు. దీనిపై ఇద్దరి నీ విచారించామన్నారు. ఆ రోజు ఫోన్లో రాత్రి పూట తప్పుగా మాట్లాడుకున్నామని ఒప్పు కున్నారన్నారు. దీనిపై వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాస్రావు ఉన్నారు.