నిషేధిత మందులు విక్రయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-07-25T05:22:46+05:30 IST

ప్రభుత్వం నిషే ధించిన పురుగు మందులు, ఎరువులను విక్రయి స్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌ హెచ్చరించారు. ఈనెల 23న ‘ఆంధ్ర జ్యోతి’లో ‘కలుపు మందులేవీ’ శీర్షికన వచ్చిన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు.

నిషేధిత మందులు విక్రయిస్తే చర్యలు
రికార్డులను పరిశీలిస్తున్న జేడీఏ శ్రీధర్‌

జేడీఏ శ్రీధర్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ 

నరసన్నపేట, జూలై 24: ప్రభుత్వం నిషే ధించిన పురుగు మందులు, ఎరువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌ హెచ్చరించారు. ఈనెల 23న ‘ఆంధ్ర జ్యోతి’లో ‘కలుపు మందులేవీ’ శీర్షికన వచ్చిన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. శనివారం పట్టణంలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు దుకాణాల్లో నిషేధిత ఫెర్టిలైజర్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.3.24 లక్షలు ఉంటుందని జేడీ పేర్కొన్నారు. సంబంధిత వ్యాపారు లపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అనుమతించిన మందు లనే విక్రయించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని స్ప ష్టం చేశారు. పురుగు, కలుపు నివారణ మందులు విక్రయాలకు సంబంధించిన రసీదులను పరిశీలించారు. కార్యక్రమంలో టెక్కలి ఏడీఏ తిరుమలరావు, ఏవో సునీత తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T05:22:46+05:30 IST