ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-12-02T05:09:38+05:30 IST

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : ఆర్డీవో

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : ఆర్డీవో
కాచవానిసింగారంలో పర్యటిస్తున్న ఆర్డీవో రవికుమార్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కీసర డివిజన్‌ ఆర్డీవో రవికుమార్‌ హెచ్చరించారు. బుధవారం కాచవానిసింగారంలో సర్వేనెంబర్‌ 66లో వెలిసిన అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఎవరైనా ప్రభుత్వ భూముల జోలికివస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఆర్‌ఐ అలేఖ్య, వీఆర్‌వో సాహితి, రెవెన్యూ సిబ్బంది, తదితరులున్నారు.


Updated Date - 2021-12-02T05:09:38+05:30 IST