ఆక్రమణలపై చర్యలు
ABN , First Publish Date - 2021-06-18T04:57:44+05:30 IST
పట్టణంలోని యర్రమునిరెడ్డి కాలనీలో ఆక్ర మణలను గురువారం మున్సిపల్ అధికారులు తొలిగించారు.
ప్రొద్దుటూరు, జూన్ 17 : పట్టణంలోని యర్రమునిరెడ్డి కాలనీలో ఆక్ర మణలను గురువారం మున్సిపల్ అధికారులు తొలిగించారు. వైఎంఆర్ కాలనీ రోడ్డును విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న బంకులు, దుకాణాలను తొలగించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పాణ్యం యర్రమునిరెడ్డి కుటుంబీకులు సుభాష్రెడ్డి కమిషనర్ను కలిసి ప్రధాన రోడ్డు వద్ద ఉన్న యర్రమునిరెడ్డి ఆర్చీని నిర్మించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో కమిషనర్ రాధ, కౌన్సిలర్లు బంగారురెడ్డి, వరికూటి ఓబులరెడ్డిలు పాల్గొన్నారు.