భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-03-05T06:06:31+05:30 IST

వేములవాడలో ఈ నెల 10 తేదీ నుంచి 12 వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు.

భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న మేనేజర్‌ శ్రీధర్‌

- మహాశివరాత్రి జాతరకు 793 ప్రత్యేక బస్సులు

- 14 ఉచిత మినీ బస్సులు 

-  కరీంనగర్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌

వేములవాడ టౌన్‌, మార్చి 4 : వేములవాడలో ఈ నెల 10 తేదీ నుంచి 12 వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బం దులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్‌ ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. వేములవాడ మున్సిపల్‌ పరిధి లోని తిప్పాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లోని కార్యాల యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  జాతర సందర్భంగా  793 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు   చెప్పారు. పట్టణంలోని కట్టకింద ప్రాంతంలో తాత్కాలిక బస్టాండ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆ ప్రాంతంలో జగిత్యాల రీజనల్‌ మేనేజర్‌ సత్యనారాయణ విధు ల నిర్వహిస్తారని,  భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా సూచనలు ఇస్తారని పేర్కొన్నారు.  తిప్పా పూర్‌ బస్టాండ్‌ నుంచి వరంగల్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, నర్సంపేట, కామారెడ్డి డిపోలకు   వెళ్లే బస్సులు నడుస్తాయని, జగిత్యాల, కొండగట్టు, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిర్మల్‌కు వెళ్లే బస్సులు కట్టకింద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ నుంచి  వెళ్తాయని తెలిపారు.   తిప్పాపూర్‌ బస్టాం డ్‌ నుంచి రాజన్న గుడి వరకు 14 ఉచిత మినీ  బస్సులను నడిపంచనున్నట్లు చెప్పారు. జగిత్యాల రీజనల్‌ మేనేజర్‌ సత్య నారాయణ, వేములవాడ డిపో మేనేజర్‌ భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-03-05T06:06:31+05:30 IST