వరద బీభత్స గ్రామాల్లో ఊపందుకుంటున్న కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-12-07T05:18:40+05:30 IST

వరద బీభత్స ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలు వేగవంతమయ్యాయి.

వరద బీభత్స గ్రామాల్లో ఊపందుకుంటున్న కార్యక్రమాలు
ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న అధికారులు

 ఇంటి పట్టాలు పంపిణీ - అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం 

రాజంపేట, డిసెంబరు6 : వరద బీభత్స ప్రాంతంలో ప్రభుత్వ సహాయ సహకారాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి సోమవారం అధికారులు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి పులపత్తూరు, తొగూరుపేట, గుండ్లూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె ప్రాంతాల్లో ఆధార్‌ కార్డులను, రికార్డుల ధృవీకరణ పత్రాలను అందజేశారు. అలాగే రేషన్‌కార్డులు, 1బీలు అందజేశారు. 435 మంది ఇళ్లు కోల్పోయిన వారిని గుర్తించి ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేపట్టారు. తొగూరుపేట పంచాయతీ చింతలకోనలో సర్పంచ్‌ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పౌష్టికాహారాలు అందజేశారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-12-07T05:18:40+05:30 IST