ఢిల్లీ వీధుల్లో పండ్లు అమ్ముకుంటున్న నటుడు సోలంకి

ABN , First Publish Date - 2020-05-27T08:00:13+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగులు బంద్‌ కావడంతో సినీ నటులకూ కష్టాలు తప్పడంలేదు.

ఢిల్లీ వీధుల్లో పండ్లు అమ్ముకుంటున్న నటుడు సోలంకి

ముంబై, మే 26: లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగులు బంద్‌ కావడంతో సినీ నటులకూ కష్టాలు తప్పడంలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నపాటి నటులకు కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. బాలీవుడ్‌ చిత్రం ‘డ్రీమ్‌గర్ల్‌’లో నటించి ప్రేక్షకులను అలరించిన సోలంకి దివాకర్‌.. ప్రస్తుతం పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఢిల్లీలోని శ్రీనివాసపురి ప్రాంతంలో ఉంటున్న ఆయన.. మాలవీయ నగర్‌, లజ్‌పత్‌ నగర్‌లో బండిపై పం డ్లు అమ్ముతూ భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. ‘నేను సినిమాల్లో నటించి బాగా డబ్బు సంపాదించి ఉంటే.. ఇప్పు డు పండ్లు అమ్మకపోయేవాడిని.’ అని సోలంకి  చెప్పారు.

Updated Date - 2020-05-27T08:00:13+05:30 IST