మరోసారి పెద్దమనసు చాటిన సోను సూద్..!
ABN , First Publish Date - 2020-08-14T13:27:42+05:30 IST
ఫిలిప్పీన్స్ నుంచి 39 మంది చిన్నారులు న్యూఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం వారి విమాన ప్రయాణానికి సినీనటుడు సోను సూద్ సాయం ప్రకటించారు.
ముంబై, ఆగస్టు 13: ఫిలిప్పీన్స్ నుంచి 39 మంది చిన్నారులు న్యూఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం వారి విమాన ప్రయాణానికి సినీనటుడు సోను సూద్ సాయం ప్రకటించారు. ఆ చిన్నారులకు న్యూఢిల్లీలో కాలేయ మార్పిడి చికిత్స చేయించడానికి ఇంతకు ముందు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయితే, కరోనాతో ఇబ్బంది తలెత్తడంతో ఆ చిన్నారుల విమాన ప్రయాణం ఆగిపోయింది. విషయం తెలుసుకున్న సోను సూద్.. ఆ చిన్నారులు రెండు రోజుల్లో భారత్కు వచ్చేలా చేస్తానని ట్వీట్ చేశారు.