నూతన వ్యవసాయ విధానాలు రైతులకు లాభసాటి
ABN , First Publish Date - 2021-10-28T04:07:33+05:30 IST
నూతన వ్యవసాయ విధానాలు అవలంబిస్తే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యవాణి పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ డీడీ సత్యవాణి
కావలి రూరల్, అక్టోబరు 27: నూతన వ్యవసాయ విధానాలు అవలంబిస్తే రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యవాణి పేర్కొన్నారు. పట్టణంలోని అగ్రికల్చర్ ల్యాబ్ కార్యాలయంలో భారత్ అమృత్ మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం రైతులకు వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రైతులు వరి విత్తనాల్లో అనుకూలమైన రకాలు ఎంపిక చేసుకోవాలన్నారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ వినీత, కావలి ఏడీఏ కన్నయ్య, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ శ్రీనివాసులు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.