కృష్ణపట్నం పోర్టులో . పెట్టుబడులు 100 శాతానికి పెంచుకున్న అదానీ గ్రూప్...

ABN , First Publish Date - 2021-04-05T23:37:03+05:30 IST

ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్... కృష్ణపట్నం పోర్టులో తన పెట్టుబడిని 100 శాతానికి పెంచుకుంది.

కృష్ణపట్నం పోర్టులో . పెట్టుబడులు 100 శాతానికి పెంచుకున్న అదానీ గ్రూప్...

అహ్మదాబాద్ : ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్... కృష్ణపట్నం పోర్టులో తన పెట్టుబడిని 100 శాతానికి పెంచుకుంది. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటివరకూ ఉన్న విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను అదానీ పోర్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ వాటా విలువ రూ. 2,800 కోట్లు. ఈ మేరకు అదానీ పోర్ట్స్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా డీల్‌తో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం... అదానీ పోర్ట్స్‌కు బదలాయింపు జరిగింది. 


కాగా, కిందటి సంవత్సరం కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ డీల్ విలువ రూ. 13,675 కోట్లుగా అదానీ గ్రూప్ పేర్కొంది. ఇదిలాఉంటే... కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం పోర్టు యాజమాన్యం మొత్తం అదానీ పోర్ట్స్‌కు బదిలీ అయిన నేపధ్యంలో... 2025 నాటికి 500 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యాన్ని చేరుకుంటుందని అదానీ పోర్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది.

Updated Date - 2021-04-05T23:37:03+05:30 IST