అడ్డగూడూరు పీఎస్‌ లాకప్‌ డెత్‌ కేసులో మరో అధికారిపై వేటు

ABN , First Publish Date - 2021-06-27T01:02:51+05:30 IST

జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో మరో

అడ్డగూడూరు పీఎస్‌ లాకప్‌ డెత్‌ కేసులో మరో అధికారిపై వేటు

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో మరో అధికారిపై వేటు పడింది. చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్యను రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌కు చౌటుప్పల్‌ ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసులో ఇప్పటికే ఎస్సై మహేష్‌, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు. 

Updated Date - 2021-06-27T01:02:51+05:30 IST