జహీరాబాద్‌లో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2020-04-09T10:55:53+05:30 IST

అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి జహీరాబాద్‌లో బుధవారం పర్యటించారు. పట్టణంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల బృందావన్‌ కాలనీలో

జహీరాబాద్‌లో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి పర్యటన

బృందావన్‌ కాలనీ, అల్గోల్‌లో కందుల కొనుగోళ్ల పరిశీలన


జహీరాబాద్‌, ఏప్రిల్‌ 8 : అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి జహీరాబాద్‌లో బుధవారం పర్యటించారు. పట్టణంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల బృందావన్‌ కాలనీలో మర్కజ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉందని వైద్యులు తేల్చడంతో అధికారులు అప్రమత్తమై కాలనీలో ఎవరెవరు ఉంటున్నారో పూర్తిస్థాయి సమాచారం సేకరించాలన్నారు. బృందావన్‌ కాలనీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అల్గోల్‌ గ్రామంలో శనగల కొనుగోళ్ల తీరును పరిశీలించారు. రైతుల ఇబ్బందులు పడకుండా వ్యవసాయ అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రంసింహారెడ్డి, రెవెన్యూ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-09T10:55:53+05:30 IST