ఫైబర్బోర్డు దిగుమతులపై అదనపు సుంకం!
ABN , First Publish Date - 2021-05-05T06:55:45+05:30 IST
ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, శ్రీలం క, వియత్నాం దేశాల నుంచి చౌకగా వచ్చిపడుతున్న ఫైబర్బోర్డు దిగుమతులకు చెక్ పెట్టాలని భారత్...
న్యూఢిల్లీ: ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, శ్రీలం క, వియత్నాం దేశాల నుంచి చౌకగా వచ్చిపడుతున్న ఫైబర్బోర్డు దిగుమతులకు చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది. దేశీయ ఫైబర్బోర్డు పరిశ్రమ ఉనికికి ప్రమాదంగా మారిన ఈ దిగుమతులపై ఐదేళ్ల పాటు అదనపు దిగుమతి సుంకం విధించాలని వాణిజ్య శాఖ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సుంకం దిగుమతి వ్యయంపై 8.29 శాతం నుంచి 27.52 శాతం ఉండాలని కోరింది.