Adilabadలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , First Publish Date - 2021-08-24T15:37:08+05:30 IST
జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా...వెంటనే వారిని రిమ్స్కు తరలించారు. మహరాష్ట్రలోని నాగ్పూర్ నుండి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.