ఆవులను ముస్లింలకు విక్రయించవద్దు
ABN , First Publish Date - 2020-07-26T09:56:05+05:30 IST
బక్రీద్ సమయంలో ఆవులను అధికంగా వధిస్తారని హిం దువులు ముస్లిం సోదరులకు ఆవులను విక్రయించవద్దని ఆదిలాబాద్ ఎంపీ సో యం బాపురావు అన్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు
జన్నారం, జూలై 25 : బక్రీద్ సమయంలో ఆవులను అధికంగా వధిస్తారని హిం దువులు ముస్లిం సోదరులకు ఆవులను విక్రయించవద్దని ఆదిలాబాద్ ఎంపీ సో యం బాపురావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో హరిత రిసార్ట్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గోవధను అరికట్టాలని, బక్రీద్ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి గోవులను తరలించేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మో హన్రెడ్డి పోడు వ్యవసాయం చేసుకునే వారందరికి భూమి పట్టాలు ఇస్తున్నారని, తెలంగాణలో సైతం ఆదివాసీలకు భూమి హక్కు పట్టాలివ్వాలన్నారు. ఆదివాసీల పై అటవీ అధికారుల పెత్తనం ఎక్కువైందని, అడవికి వెళ్ళి తడకలు అమ్ముకొని జీవించేవారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌజ్ను వదిలి బయటకు వస్తేనే ప్రజలు పడుతున్న కష్టాలు కనిపిస్తాయని, ప్రజలు కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. వెం టనే టెస్ట్ల సంఖ్య పెంచి కరోనా వ్యాప్తి జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవా లన్నారు. మండల బీజేవైఎం నాయకులు కొండపల్లి మహేష్పై ఇటీవల కొందరు దాడి చేయగా ఆయనను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారినే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్, గోలి చందు, సూర్యం, రవి, నాగన్న పాల్గొన్నారు.