ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారు: మంత్రి సురేష్

ABN , First Publish Date - 2021-11-30T22:21:39+05:30 IST

జగన్ ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారని మంత్రి సురేష్ అన్నారు. కరోనా వంటి విపత్తులు వచ్చినా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదన్నారు.

ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారు: మంత్రి సురేష్

అమరావతి: జగన్ ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారని మంత్రి సురేష్ అన్నారు. కరోనా వంటి విపత్తులు వచ్చినా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదన్నారు. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. రాజకీయాల్లో దౌర్జన్యాలు చేయడం టీడీపీ సంస్కృతని విమర్శించారు. సీఎం గాల్లో కలిసిపోతారనే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు పార్టీలు కుమ్మక్కై దాడి చేయాలని కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు వస్తే ప్రభుత్వ తప్పిదం అంటున్నారని చెప్పారు. 

Updated Date - 2021-11-30T22:21:39+05:30 IST