ప్యాకేజీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: ఆదినారాయణరెడ్డి
ABN , First Publish Date - 2020-05-23T17:30:14+05:30 IST
అనంతపురం: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, మమతా బెనర్జీ కేంద్ర ప్యాకేజీపై దారుణంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయం సేకరించిన మీదటే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.