నేటి నుంచి ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవాలు
ABN , First Publish Date - 2021-04-19T04:54:43+05:30 IST
రసవల్లి సూర్యనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవాలు సోమవారం నుంచి ప్రారం భంకానున్నాయి.
గుజరాతీపేట: అరసవల్లి సూర్యనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవాలు సోమవారం నుంచి ప్రారం భంకానున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు కల్యాణ ధ్వజారోహనం, పతాకావిష్కరణ, సకల దేవతార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27 వరకూ స్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయని ఈవో హరిసూర్యప్ర కాష్ తెలిపారు. భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఆదిత్యుని ఆదాయం రూ.2.96 లక్షలు
అరసవల్లి సూర్యనారాయణస్వామికి ఆదివారం రూ.2,96,500 ఆదాయం లభించినట్లు ఈవో హరిసూ ర్యప్రకాష్ తెలిపారు. టిక్కెట్ల ద్వారా రూ.51,500, విరాళాల రూపంలో రూ.1.20లక్షలు, ప్రసాదాల ద్వారా రూ.1.25 లక్షల ఆదాయం సమకూరినట్లు వివరించారు. పోలాకి మండలం దండులక్ష్మీ పురానికి చెందిన దార్లపూడి శ్రీనివా స్శర్మ, భార్య భానుప్రియ, కుమారుడు శరవణ మహేష్ శర్మ, నగరంపల్లి త్యాగరాజశర్మలు ఆదిత్యుని నిత్యాన్నదా నం కోసం లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఈవో హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు శంకరశర్మ, సూపరింటెండెంట్ చక్రవర్తి పాల్గొన్నారు.