ఆదిత్య బిర్లా చేతికి మిసాబా
ABN , First Publish Date - 2022-01-15T08:39:50+05:30 IST
ఆదిత్య బిర్లా చేతికి మిసాబా
న్యూఢిల్లీ : ప్రముఖ డిజైనర్ మిసాబా గుప్తా యాజమాన్యంలోని సమకాలీన బ్రాండ్ మిసాబాలో 51 శాతం వాటాలను ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.90 కోట్లు. కొత్తతరం యువత, డిజిటల్ నైపుణ్యాలు గల వినియోగదారుల విభాగంలో మరింత శక్తివంతం కావాలన్న ఆదిత్య బిర్లా ఆకాంక్షకు ఇది సహాయకారిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఉభయ సంస్థలు సంతకాలు చేశాయి.