గిరిజనులు సాగు చేస్తున్న భూమిపై హక్కు కల్పించాలి

ABN , First Publish Date - 2021-07-30T04:47:17+05:30 IST

కొంతకాలంగా గిరిజనులు సాగు చేస్తున్న భూములపై హక్కు క ల్పించాలని ఆదీవాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరావు కోరారు.

గిరిజనులు సాగు చేస్తున్న భూమిపై హక్కు కల్పించాలి
ధర్నా చేస్తున్న ఆదివాసీ నేన నాయకులు

జీలుగుమిల్లి, జూలై 29: కొంతకాలంగా గిరిజనులు సాగు చేస్తున్న భూములపై హక్కు క ల్పించాలని ఆదీవాసీ సేన  రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరావు కోరారు. తహసీల్దారు జి.ఎలీషాకు గురువారం  వినతిపత్రం అందజేశారు. నారాయణపురం సమీపంలోని భూముల్లో 110 మంది గిరిజనులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. గతంలో తమ పంటల ధ్వసం చేసి ఆ భూముల నుంచి తొలగించడానికి అధికారులు ప్రయత్నం చేశారని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Updated Date - 2021-07-30T04:47:17+05:30 IST