పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుంది: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-06-02T21:47:51+05:30 IST

3 రాజధానుల అంశం కోర్టులో పరిధిలో ఉందని, పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.

పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుంది: విజయసాయిరెడ్డి

విశాఖ: 3 రాజధానుల అంశం కోర్టులో పరిధిలో ఉందని, పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని  చెప్పారు. సీఆర్డీఏ చట్టానికి, 3 రాజధానులకు సంబంధం లేదని పేర్కొన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ వస్తుందని డేట్‌ అడగొద్దని సూచించారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్లు వేస్తామని, ముడసర్లోవ పార్క్‌ని అంతర్జాతీయ పార్క్‌ చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

Updated Date - 2021-06-02T21:47:51+05:30 IST