ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలి: డీఐ
ABN , First Publish Date - 2020-07-18T11:28:23+05:30 IST
నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని రాజమహేంద్రవరం అర్బన్ డీఐ బి.దిలీప్ కుమార్ ..
రాజమహేంద్రవరం సిటీ, జూలై 17: నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని రాజమహేంద్రవరం అర్బన్ డీఐ బి.దిలీప్ కుమార్ కోరారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటివరకు 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులను ప్రమోట్ చేశారని, వారిని రిజిస్టర్లో నమోదు చెయ్యాలన్నారు. నూతనంగా అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికల పాఠశాలల్లో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ఈ నెల 20 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.