దత్తత ప్రక్రియ గడువులు పొడిగింపు: కారా

ABN , First Publish Date - 2020-06-05T07:53:17+05:30 IST

కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా దత్తత ప్రక్రియల గడువుల్ని పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల దత్తత సంస్థలకు...

దత్తత ప్రక్రియ గడువులు పొడిగింపు: కారా

న్యూఢిల్లీ, జూన్‌ 4: కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా దత్తత ప్రక్రియల గడువుల్ని పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల దత్తత సంస్థలకు, బాలల రక్షణ సంస్థలకు లేఖ రాసింది. పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు(పీఏపీలు), వారు కోరిన శిశువును దత్తత తీసుకునేందుకు సరైన వారో కాదో అధికారులు నిర్ణయిస్తారు. మ్యా చింగ్‌గా వ్యవహరించే ఈ ప్రక్రియ గడువును, కోర్టుల్లో పిటిషన్‌ పెట్టుకునే గడువును 30వరకూ పెంచే నిర్ణయించామని కారా పేర్కొంది. న్యాయస్థానాలు రిజిస్ట్రీలను తెరవని పక్షంలో, అవి తెరిచే వరకూ పిటిషన్‌కు గడువు కొనసాగుతుందని తెలిపింది. మరిన్ని ఆదేశాలు వచ్చేవరకూ.. పిల్లలను పీఏపీల దృష్టికి తెచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు కారా లేఖలో స్పష్టం చేసింది.  


Updated Date - 2020-06-05T07:53:17+05:30 IST