అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా

ABN , First Publish Date - 2021-04-20T05:39:47+05:30 IST

మండలంలోని శ్రీరాంనగర్‌ శివారులో సోమవారం మామిడి కాయలు తెంపడానికి కూలీలతో వెళ్తున్న ట్రాక్టరు అదుపు తప్పి బోల్తా పడింది.

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా
పరామర్శిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

పలువురికి గాయాలు 

రాయికల్‌, ఏప్రిల్‌ 19: మండలంలోని శ్రీరాంనగర్‌ శివారులో సోమవారం మామిడి కాయలు తెంపడానికి కూలీలతో వెళ్తున్న ట్రాక్టరు అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్న  12మందికి తీవ్రగాయాలు కాగా మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌లో సుమారు 40మందికి పైగా కూలీలు మండలంలోని భూపతిపూర్‌ గ్రామానికి చెందిన వారు ఉన్నారు. జగిత్యాల ఏరియా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరివెంట సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు ఉన్నారు. 


Updated Date - 2021-04-20T05:39:47+05:30 IST