వేణుగోపాలదీక్షితుల విధుల్లో జోక్యం వద్దు!
ABN , First Publish Date - 2021-05-06T08:55:13+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న వేణుగోపాల దీక్షితుల విషయంలో దేవదాయశాఖ, టీటీడీ ఈవో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి
ఆ మేరకు టీటీడీ, దేవదాయ శాఖను ఆదేశించండి
హైకోర్టులో న్యాయవాది మోహన్రెడ్డి వాదనలు
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్న వేణుగోపాల దీక్షితుల విషయంలో దేవదాయశాఖ, టీటీడీ ఈవో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పదవీ విరమణ చేసిన రమణదీక్షితులును టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాలదీక్షితులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారని, ఏప్రిల్ 2న టీటీడీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేరకు ఆయన విధుల్లో జోక్యం చేసుకోకుండా దేవదాయశాఖ సహా టీడీపీ ఈవోను నిలువరించాలని విన్నవించారు. కాగా, ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి బుధవారం తీర్పును వాయిదా వేశారు.