Panjshir: తాలిబన్ల దాడి: అఫ్ఘాన్ నిరోధకదళ సీనియర్ సభ్యుడి హతం
ABN , First Publish Date - 2021-09-06T13:42:49+05:30 IST
అప్ఘానిస్థాన్ దేశంలోని పంజ్షీర్ ప్రావిన్సులో తాలిబన్ల దాడిలో అఫ్ఘాన్ రెసిస్టెన్స్ ఫ్రంట్ సీనియర్ సభ్యుడు హతమయ్యాడు....
పంజ్షీర్ (అప్ఘానిస్థాన్): అప్ఘానిస్థాన్ దేశంలోని పంజ్షీర్ ప్రావిన్సులో తాలిబన్ల దాడిలో అఫ్ఘాన్ రెసిస్టెన్స్ ఫ్రంట్ సీనియర్ సభ్యుడు హతమయ్యాడు.అఫ్ఘాన్ తిరుగుబాటు దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో తమ గ్రూపులోని మరో సీనియర్ సభ్యుడైన జనరల్ అబ్దుల్ వుడోద్ జారా మరణించారని అఫ్ఘాన్ జాతీయ ప్రతిఘటన సోమవారం తెలిపింది.జనరల్ వుడోద్ పంజ్షీర్ నిరోధక నాయకుడు అహ్మద్ మసౌద్ మేనల్లుడు. అమృల్లా సలేహ్ ఇంటిపై హెలికాప్టర్ దాడి ఘటన తర్వాత అతను సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.అఫ్ఘానిస్థాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రతినిధి ఫాహిమ్ దష్తి మరణించినట్లు అఫ్ఘాన్ మీడియా నివేదించిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది.అఫ్ఘాన్ ప్రతిఘటనకు చెందిన ఫాహిం దష్టీ, జనరల్ అబ్దుల్ వుడోద్ జారాలు అమరులయ్యారని, వారి జ్ఞాపకం శాశ్వతంగా ఉంటుందని అఫ్ఘాన్ ప్రతిఘటన విభాగం పేర్కొంది.